సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, అక్టోబర్ 2022, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 39

 

ఆయతామ్నాయవివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – హే పార్వతి ఇప్పుడు ఆయతామ్నాయ దేవతా వర్ణన చేస్తాను. ఈ దేవతను పూజించిన మాత్రముననే సమస్త సిద్ధులూ కలుగుతాయి. పాంచరాత్రము మరియు వైష్ణవ ఆగమములలో ఈ విద్యా కథనము చెయ్యబడినది. హే దేవేశీ! ఈమెను ఆరాధించే ఈశ్వరుడు మూడులోకములనూ పాలించగలుగుతున్నాడు. ఈ విద్యలు మొత్తము తొమ్మిది. ఈ కారణంగా శివా శివమయి. సిద్ధిరత్న మహాతంత్రమునందు గణేశామ్నాయము తెలుపబడినది. ఈ గణేశామ్నాయము ఏడు కోట్ల మహాతంత్రముల నుండి అలంకరించబడినది. వామదేవ మహాతంత్రము నందు సూర్యసంబంధిత జ్ఞానము ప్రకాశితము. సౌర జ్ఞానమయీ దేవీ మనః జ్ఞానశక్తి. అందువలననే ఈ దేవి చతురామ్నాయముల ద్వారా సదా సేవించబడుచున్నది. సింహాసన ప్రసంగమున నాలుగు ఆమ్నాయ దేవతలను చెప్పబడి ఉన్నది. వీరిని స్మరించిన మాత్రముననే మహా ఆపత్తులు దూరంగా పోవును.  

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన ఆయతామ్నాయవివరణం అను ముఫైతొమ్మిదవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: