సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, ఏప్రిల్ 2023, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 60

 

బలియజనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – ఆరు రుచుల యుక్త, కామధేను పాలు మొదలగు వాటితో పవిత్రించిన నైవేద్యమును పరశక్తికి అర్పించిన తర్వాత కర్పూర సహిత తాంబూలమును సమర్పించాలి. ఆ తర్వాత నిత్య హోమము చెయ్యాలి. ఆ తర్వాత యథాశక్తి జపము, స్తుతి చెయ్యాలి. సౌభాగ్య దేవతకు నమస్కరించి బంగారము-వెండి-కాంస్య పాత్రల్లో అష్టదళ పద్మము వెయ్యాలి. దానిమీద గంధముతో బాటు చారు లేదా ముద్రను ఉంచాలి. నేతితో చేసిన తొమ్మిది దీపములను రత్నమంత్రముతో గానీ మూల మంత్రముతో గానీ ఒకొక్క దీపమును మస్తకము మీద ఉంచి అష్టదళ పద్మము పైన ఉంచాలి. మోకాళ్లమీద నిలబడి రెండు చేతులతోనూ ఆ పాత్రను పట్టుకొని “సమస్త చక్రచక్రేశీయుతే దేవీ నవాత్మకే|  ఆరార్తికమిదం దివ్యం గృహాణ మమ సిద్ధయే|” అను మంత్రమును ఉచ్చరిస్తూ దేవి చుట్టూ ఆ దీపములను తిప్పాలి. చివర సమస్త విఘ్నముల శాంతి కొరకు ధ్యానము చెయ్యాలి. ఆ పాత్రను ఎడమవైపున ఉంచాలి.

20, ఏప్రిల్ 2023, గురువారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 59

 

శ్రీవిద్యాయజనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – అగ్ని, ఈశాన, నైరుతి, వాయవ్య, దిశలకు మధ్యన అంగదేవతలను పూజించాలి. సాధకుడు తన గురుక్రమానుసారంగా పూజ చెయ్యాలి. భూపురము, షోడశారము, అష్టదళము – ఈ క్రమము సృష్టిచక్రము. శ్రీ, పరిజ్యోతి, ఆద్యా క్రమంలో పూజచెయ్యాలి. చతుర్దశారము, బహిర్దశారము, అంతర్దశారము – ఈ క్రమము స్థితిచక్రము. అష్టకోణము, త్రికోణము, బిందువు – ఈ క్రమము సంహార క్రమము. దీని యందు తృతీయ సకలను పూజించాలి. అనాఖ్యను సకల అని కూడా అంటారు. సాధకుడు తురీయ సకల విద్యల క్రమంలో కూడా పూజ చెయ్యాలి. ఈ ప్రకారంగా సాధకుడు సంపూర్ణ విద్యాసమూహములతో పూజ చెయ్యాలి. సాధకుడు శ్రీకోశసింహాసనస్థ, కల్పలతాత్మక, రత్నాత్మక, చతురాయతనాత్మక, చతురన్వయగంభీర – వీరందరినీ కూడా పూజించాలి. యాభై వర్ణముల శరీర త్రైలోక్యచక్రమున ప్రకట యోగినులు అనబడు దశసిద్ధులను పూజించాలి. ఈ సిద్ధులు అప్పుడే కాల్చబడిన బంగారు వర్ణములో ఉంది పాశ, అంకుశములను ధరించి ఉంటారు. చేతుల్లో కమలములు ధరించి పెద్ద పెద్ద భండారములలో బంగారములను, నిధులను తమ భక్తులకు ఇస్తారు.

11, ఏప్రిల్ 2023, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 58

 

ధ్యానాదియజనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు –

చక్రమును చందనము లేదా రక్తచందనము లేదా కమల పత్రముల మీద ఉంచాలి. మరోవిధంగా ఉంచరాదు. ఇంతకు ముందు చెప్పిన విధంగా న్యాసములు చేసిన తర్వాత బ్రహ్మాండమండలమును ధ్యానం చెయ్యాలి. ఆ మండలము పృథ్వీ,జలము, అగ్ని, ఆకాశము మరియు చైతన్యముల ప్రకాశికము. అది చతురస్రము, ధనుషాకార త్రికోణము. అది మేరుమండల నిరాలంబముగా చెప్పబడినది. దానిమీద వాగ్బీజ రూపి, భ్రమరముతో యుక్తమైన వ్యాపక చక్రము ఉంది. శ్రీ శాంభవ జ్ఞానములో పరావాక్, వనస్పతి సంబంధించిన దానిలో మధ్యమా, సర్వ జంతువులందు పశ్యంతి, జ్ఞానయోగినులందు వైఖరీ - వాక్కులు. ఈ ప్రకారంగా సహస్రదళ కమలము వాక్పదముతో సంపన్నము. దీని మీద పరమపీయూష ఆశ్రయమున చక్రము కలదు. ఆ చక్రము చతురస్రము, షోడశదళము, 64 దళములు,100 దళములు, 1000 దళములు, లక్ష దళములు, కోటి దళములు, ఆకాశతలముల మీద శోభాయుక్తముగా, దేదీప్యమానముగా ఉంటుంది. దాని కర్ణికాపీఠ మధ్యమున చక్రేశ్వరీ ధ్యానము చెయ్యాలి. ఆ చక్రము మహా షడధ్వ జనకము మరియు విశ్వతోముఖము, దేదీప్యమానము.