శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం
శ్రీమహాకాళ సంహితలో చెప్పబడిన శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం ఎంతో
మహిమాన్వితమైనది. ఈ స్తవ పారాయణ వలన సాధకుని కామము నిర్మూలించబడి బాలా మంత్రం త్వరగా
సిద్ధిస్తుందని ప్రతీతి.
శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం
శ్రీమహాకాళ సంహితలో చెప్పబడిన శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం ఎంతో
మహిమాన్వితమైనది. ఈ స్తవ పారాయణ వలన సాధకుని కామము నిర్మూలించబడి బాలా మంత్రం త్వరగా
సిద్ధిస్తుందని ప్రతీతి.
మాతృకాచక్రము
అక్షరముల సిద్ధాంతమే మాతృకాచక్రము. ఈ చరాచర జగత్తు అంతా భగవంతుడు అయిన శివుని ద్వారా సృష్టించబడినది అని సిద్ధాంతము ద్వారా నిరూపించబడుతుంది. అతడు తన ఇచ్ఛామాత్రముననే ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ విశ్వమంతా అతని ప్రతిబింబము మాత్రమే.
అరవైఅయిదవ భాగము
దమనకారోపణవిధివివరణం
ఈశ్వరుడు చెప్పుచున్నాడు – ఈ క్రియను కూడా పవిత్రారోపణ క్రమంలోనే చెయ్యాలి. ఈ క్రియను ఆచరించుటకు చైత్రాది మూడు మాసములు మరియు శుక్లపక్షము ఉత్తమము. చైత్రము ఉత్తమం, వైశాఖం మధ్యమం, జ్యేష్ఠం అధమం. అష్టమీ, చతుర్దశీ, పౌర్ణమి తిథులలో అర్ధరాత్రి సమయంలో ముందుగా అధివాసము చెయ్యాలి. నాలుగు కల్పలతాదులతో బాటుగా ప్రథమ దమనమును ఆమంత్రితము చేసి “శివాప్రసాదసంభూత అన్న సన్నిహితో భవ| శివకార్యం సముద్దిశ్య ఛేత్తవ్యోసి శివాజ్ఞయా|” ఈ విధంగా ఆమంత్రణ చేసి రతి, కాములను పూజించాలి. ఆ తర్వాత సాధకుడు తనకు తానుగా గానీ, ఇతర మౌనుల ద్వారా గానీ పల్లవములు, మూలము సహితంగా తీసుకువచ్చిన దమనమును సర్వతోభద్ర కమలములో ఎడమవైపున స్థాపించాలి. ఆ తర్వాత ఎనిమిది అంగుళముల పొడవు, నాలుగు అంగుళముల వెడల్పు గల యంత్రమును స్థాపించి పూజించాలి. “ఓం హ్రీం రత్యై నమః” అను రతిమంత్రము మరియు “ఓం క్లీం కామాయ నమః” అను కామదేవ మంత్రముతో రతి, కామదేవులను పూజించాలి. దమనమును ఒక పవిత్ర పాత్రలో పెట్టి పూజించాలి.
పవిత్రారోపణవిధివివరణం
ఈశ్వరుడు చెప్పుచున్నాడు – పవిత్రారోపణ అనగా అనుష్ఠాన విధి. పవిత్రారోపణమును చేసినచో అన్ని కార్యములు ఫలించును (సత్యమవును) లేనిచో నిష్ఫలమవుతాయి. అన్యవిధులు చేసిన తర్వాత ఏ సాధకుడు ఈ కర్మను ఒక సంవత్సర కాలంలో చెయ్యడో అతడి పూర్వకర్మల ఫలమును దుష్ట గణములు బలవంతంగా అపహరించును. ఈ పవిత్రారోపణ కర్మకు ఆషాఢ మాసము ఉత్తమము. శ్రావణం మధ్యమం, భాద్రపదం హీనము. శుక్ల పక్షము ప్రశస్తము. కృష్ణ పక్షము లాభరహితము అవుతుంది. చతుర్దశీ, అష్టమి, పూర్ణిమ తిథులలో ఈ కర్మ చెయ్యాలి. రేశ్మీ సూత్రము (దారము) విశిష్టము. నూలు దారమును కూడా ఉపయోగించవచ్చును. ఈ సూత్రముకు తొమ్మిది రెట్లు గంగాజలముతో పశ్చిమాస్య మంత్రములతో సూత్రమును శుద్ధి చేసి ఆరబెట్టాలి. మంత్రోచ్చారణ చేస్తూ సుందరమైన పవిత్రమును తయారు చెయ్యాలి. 108అంగుళముల పవిత్రము శ్రేష్ఠము. 54అంగుళముల పవిత్రము మధ్యమము. 27అంగుళముల పవిత్రము కనిష్ఠము.
దీక్షాదూతీయజనవిధివివరణం
ఈశ్వరుడు చెప్పుచున్నాడు – ఇప్పుడు మూడులోకములలోనూ దుర్లభమైన దీక్షా విధానము తెలుపుచున్నాను. సావధానముగా వినుము.
విద్యాప్రయోగబీజసాధనవిధివివరణం
ఈశ్వరుడు చెప్పుచున్నాడు – ఇప్పుడు చక్రరాజము యొక్క సాధన చెప్పబడుచున్నది. సిద్ధవిద్య వినియోగక్రమము ఈ విధంగా ఉండును.