అరవైఅయిదవ భాగము
దమనకారోపణవిధివివరణం
ఈశ్వరుడు చెప్పుచున్నాడు – ఈ క్రియను కూడా పవిత్రారోపణ
క్రమంలోనే చెయ్యాలి. ఈ క్రియను ఆచరించుటకు చైత్రాది మూడు మాసములు మరియు శుక్లపక్షము
ఉత్తమము. చైత్రము ఉత్తమం,
వైశాఖం మధ్యమం, జ్యేష్ఠం అధమం. అష్టమీ, చతుర్దశీ, పౌర్ణమి తిథులలో అర్ధరాత్రి సమయంలో
ముందుగా అధివాసము చెయ్యాలి. నాలుగు కల్పలతాదులతో బాటుగా ప్రథమ దమనమును ఆమంత్రితము
చేసి “శివాప్రసాదసంభూత అన్న సన్నిహితో భవ| శివకార్యం సముద్దిశ్య ఛేత్తవ్యోసి
శివాజ్ఞయా|” ఈ విధంగా ఆమంత్రణ చేసి రతి, కాములను పూజించాలి. ఆ తర్వాత సాధకుడు
తనకు తానుగా గానీ, ఇతర మౌనుల ద్వారా గానీ
పల్లవములు, మూలము సహితంగా
తీసుకువచ్చిన దమనమును సర్వతోభద్ర కమలములో ఎడమవైపున స్థాపించాలి. ఆ తర్వాత ఎనిమిది
అంగుళముల పొడవు, నాలుగు అంగుళముల వెడల్పు
గల యంత్రమును స్థాపించి పూజించాలి. “ఓం హ్రీం రత్యై నమః” అను రతిమంత్రము మరియు “ఓం
క్లీం కామాయ నమః” అను కామదేవ మంత్రముతో రతి, కామదేవులను పూజించాలి. దమనమును ఒక
పవిత్ర పాత్రలో పెట్టి పూజించాలి.