సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

8, జనవరి 2020, బుధవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ప్రధమశ్వాస - 3


గ్రంధావతార నిరూపణ

(శ్రీ విద్యారణ్యయతి గారు గ్రంధావతార విశేషమును ఈ క్రింది విధముగా తెలుపుతున్నారు)

ఈ గ్రంధ రచనా పూర్తి అయిన తర్వాత మహామాయ అయిన జగద్ధాత్రి నా ముందర ప్రత్యక్షమయి, ఓ వత్సా! నీకిష్టమైన వరము కోరుకొమ్ము" అని పలికెను. అమ్మ పలుకులు విని అమ్మతో నేను ఇట్లు తెలిపాను.

"అమ్మా ఈ గ్రంధము ఉత్తమమైనది. ఏ సాధకుడు భక్తి పూర్వకముగా గురుక్రమ మంత్రములను తెలుసుకొని, గురు నుండి దీక్షను పొందలేకపోయినా జపము చేస్తాడో అతని వాంఛితములు సిద్ధింపచెయ్యి. ఇదే నాకోరిక".

శ్రీదేవి ఆ కోరికను విని ప్రసన్నురాలై "తధాస్తు" అని పలికి సంతుష్టురాలై అంతర్ధానము చెందినది.

కనుక గురుసంతతి క్రమమును తప్పక తెలుసుకోవలెను. తద్వారా శ్రీదేవి తప్పక సంతుష్టురాలు అగును.

లక్ష్మణదేశిక వృత్త వర్ణన:

జగద్గురు శంకరాచార్య శిష్యులలో లక్ష్మణదేశికులు తపవిద్య మరియు శ్రీ సంపదలందు విఖ్యాతులు. పద్నాలుగు సంవత్సరముల వయస్సులోనే వైరాగి అయి విచారణ చెయ్యసాగారు. ఈ క్రమంలో ఒకనాడు అతడు ప్రౌఢదేవుని యొక్క రాజధానికి వెళ్లారు. ప్రౌఢదేవుడు అతడిని ఆదరించి ఇల్లు, అన్నము, వస్త్రము, సేవకై నౌకరులను ఇచ్చాడు. ఒక సమయంలో ప్రౌఢదేవుని సభయందు లక్ష్మణుడు కూడా కూర్చొని ఉండగా ఒక వ్యాపారి వేరొక ప్రదేశములనుండి తెచ్చిన సుందరమైన వస్తువులను, వస్త్రాలను ప్రౌఢదేవునికి సమర్పించగా, అతడు ఆ వస్త్రములను లక్ష్మణునికి ఇచ్చాడు. లక్ష్మణుడు వాటిని తన ఇంటికి తీసుకు వచ్చి కుండమునందు విధియుక్తముగా అగ్నిని స్థాపించి భక్తిభావంతో ఆ వస్త్రములను శ్రీదేవి కొరకు హోమము చేసెను. ఈ విషయం తెలుగుకున్న రాజు కోపగించి, ఒక దూతను పంపి ఇచ్చిన వస్త్రములకు ధరను కట్టవలసినదని ఆజ్ఞాపించెను. లక్ష్మణదేశికుడు ఇది విని క్రోధము చెందిన వాడై ఆరాజునకు నిర్వంశుడు అగునట్లుగా శాపమిచ్చెను. శ్రీదేవిని కోరుకొని ఆ రాజు ఇచ్చిన వస్త్రములను తిరిగి అతనికి ఇచ్చివేసి ఆ రాజ్యమును వదలి దక్షిణము వైపు వెడలెను. శాపమును విన్న రాజు కంపితుడై లక్ష్మణుడను వెదకుచూ అతని వద్దకు వచ్చి ప్రార్ధనాపూర్వకముగా తనను క్షమించమని, కృపాను జూపమని మిక్కిలి ప్రార్ధేయపడగా, లక్ష్మణుడు అతని ప్రార్ధనలకు ప్రసన్నుడయి "ఓ రాజా! నా శాపము అమోఘము. కానీ నీ ప్రార్ధనను విని నేను సంతుష్టుడయినాను. నీకు పుత్రుడు కలుగుతాడు. కానీ నువ్వు అతనికి తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించలేవు." అని తెలిపాడు. ఇది విని ప్రౌఢదేవుడు తన నగరమునకు తిరిగి వచ్చాడు. కొన్ని రోజులకు రాణి గర్భము దాల్చగా రాజునకు దేహాంతము కలిగెను.

ఇది జరిగిన తర్వాత ప్రజల ప్రార్ధనను మన్నించి శ్రీవిద్యారణ్యయతి రాజ్యభారము వహించెను. పన్నెండు వందల కోట్ల ద్రవ్యములనుండి శ్రీచక్రరసము చేసి ఉజ్జ్వలము, అద్భుతము అయిన శ్రీవిద్యానగరమును నిర్మించుటకై ప్రౌఢదేవుని పుత్రుడైన అంబదేవుడు యువకుడు అయిన తర్వాత పట్టాభిషిక్తుడిని గావించెను.
అంబదేవుడు, విద్వాంసులు, సజ్జనుల ప్రార్ధనలను మన్నించి యంత్ర పూర్వకములైన నానా తంత్రములను మరియు యామళం నుండి కాది విద్య మరియు కాళీమాతమును సమన్వయ పరచి "శ్రీవిద్యార్ణవము" అను పేరుగల ఈ గ్రంధమును లోకోపకారమునకై రచించెను.

మల్లికార్జుని శిష్యులు వింధ్య ప్రదేశము నందు కలరు.
త్రివిక్రముని శిష్యులు జగన్నాధ (= పూరీ?) దేశమునందు కలరు.
శ్రీధరుణి శిష్యులు గౌడ, మైథిలి మరియు బంగళాదేశములందు కలరు.
కపర్దుని శిష్యులు కాశీ మరియు అయోధ్యలందు కలరు.

శంకరాచార్యులు స్థాపించిన సంప్రదాయమునకు మారుగా వేరొక సంప్రదాయము లేదు.
ఇంకాఉంది....

కామెంట్‌లు లేవు: